- ఆన్లైన్ ద్వారా పలు చట్టాలపై శిక్షణ
- ప్రారంభించిన డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఇన్స్పెక్టర్ నుంచి సీపీ, ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి వరకు కోడ్ ఆఫ్ కండక్ట్పై ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ ఆన్లైన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన చట్టాలు, ఎక్సైజ్యాక్ట్, సిటీ పోలీస్ యాక్ట్ సహా పలు నేరాలపై లీగల్ అడ్వైజర్ రాములు ఆధ్వర్యంలో అవగాహన పెంచుకోవాలని సూచించారు.
త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ను సందర్శించనుందని చెప్పారు. 2014 ,2019 లో జరిగిన ఎన్నికల అనుభవాలతో ప్రణాళికలు రెడీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐడీ చీఫ్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, మల్టిజోన్ ఐజీ షా కాసీం పాల్గొన్నారు.