- ఇంతమందిని భరించే శక్తి ప్రజలకు లేదు
- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్లో నియోజకవర్గానికో సీఎం క్యాండిడేట్లు ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రైతుల నోట్లో మట్టి కొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.దళిత బంధు, రైతుబంధు నిలిపివేయాలని ఈసీని కోరడం బాధాకరం. మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దు. బీఆర్ఎస్ప్రభుత్వాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాంగ్రెస్ లో నియోజకవర్గానికో సీఎం ఉన్నరు. ఇంత మంది సీఎంలను భరించే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదు’ అని సుఖేందర్రెడ్డి అన్నారు.