ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలి

ప్రతి ఒక్కరూ  భక్తిభావంతో మెలగాలి

నెక్కొండ, వెలుగు: ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలని శాసన మండలి వైస్​చైర్మన్​ బండ ప్రకాశ్, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర​ అన్నారు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లిలో శుక్రవారం ముదిరాజ్​ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారివెంట వరంగల్​జడ్పీమాజీ ఫ్లోర్​లీడర్​పెద్ది స్వప్నాసుదర్శన్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​రాము, మండల ప్రెసిడెంట్​సూరయ్య తదితరులున్నారు.