పాఠాలు చెప్పిన డీఈవో సోమశేఖర్ శర్మ

పాఠాలు చెప్పిన డీఈవో సోమశేఖర్ శర్మ

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో సోమశేఖర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.

పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అందరూ​10 జీపీఏ సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కుసుమంచి ఉన్నత పాఠశాల ఇన్​చార్జి హెడ్మాస్టర్​ రేలా విక్రం రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.