- టీకాపై అపోహలు వీడండి
- కోల్బెల్ట్ ఏరియాల్లో వైరస్ ప్రభావం ఎక్కువ
- ఈ మూడు నెలలు అలర్ట్గా ఉండండి
- 2022 జనవరి నాటికి స్టేట్లో జీరో కోవిడ్ కేసులు
- స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘ఏ ఫుడ్ అయినా తినండి..మందు అలవాటు ఉన్నా ఓకే..వ్యాక్సిన్ వేసుకోవచ్చు. నేనైతే వ్యాక్సిన్ వేసుకున్న తెల్లవారే ఒక అకేషన్ ఉండడంతో లిక్కర్ తీసుకున్నా. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ’ అని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ప్రజాప్రతినిధులు, హెల్త్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లతో బుధవారం నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. రక రకాల భయాలతో కొంత మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ‘కరోనా టీకా వేసుకుంటే మటన్, చికెన్ తినొద్దు. మద్యం తాగొద్దు అని అనుకుంటున్నారు. ఇలాంటిదేమీ లేదు. ’ అని అన్నారు. ఇప్పుడు వరుస పండుగలు ఉన్నాయని మన తెలంగాణలో సంస్కృతిలో మందు, మాంసం భాగమని, కాబట్టి వ్యాక్సిన్ వేసుకుని కూడా ఎప్పుడూ చేసుకున్నట్టే పండుగలు చేసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత వైరస్ సోకితే చావు నుంచి తప్పించుకోవచ్చన్నారు. 2022 జనవరి నాటికి రాష్ట్రంలో కొవిడ్ కేసులు జీరోకు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం కొంత ఎక్కువగా ఉందన్నారు.
2 నుంచి 18 ఏండ్ల లోపు వారికి త్వరలో టీకా
2 నుంచి18 ఏండ్ల లోపు ఏజ్ఉన్నవారు స్టేట్లో 1.20 కోట్ల మంది ఉన్నారని, వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ అన్నారు. సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వాళ్లు 61వేల మంది ఉన్నారని, వీరంతా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలన్నారు. ఈ నెలతో పాటు నవంబర్,డిసెంబర్ నెలల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, కలెక్టర్ అనుదీప్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, హెల్త్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు పాల్గొన్నారు. తర్వాత కొత్తగూడెం క్లబ్ ఆవరణలో జిల్లాకు ఎలాట్ చేసిన 20 వ్యాక్సిన్మొబైల్వెహికిల్స్ను ఎమ్మెల్యే, హెల్త్ డైరెక్టర్, కలెక్టర్
ప్రారంభించారు.
ఆళ్లపల్లి డాక్టర్పై ఆగ్రహం
తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు, స్టాఫ్, కలెక్టర్ తో కలిసి హెల్త్ డైరెక్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీపావళి నాటికి జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వివరాలను తాను చెప్పగలుగుతానని, కానీ మీ పీహెచ్సీ పరిధిలో వ్యాక్సినేషన్ వివరాలు సరిగ్గా చెప్పలేకపోతే ఎలా అని ఆళ్లపల్లి డాక్టర్ సాగర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు ఆర్బీఎస్కే వెహికిల్స్ను ఉపయోగించుకోవాలన్నారు. టీకాలు వేసుకున్న వారి ఇండ్లకు స్టిక్కర్ అంటించాలన్నారు. తప్పనిసరిగా టార్గెట్ పూర్తి చేయాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, హాస్పిటల్స్కో ఆర్డినేటర్డాక్టర్ముక్కంటేశ్వర రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్నాగేంద్రప్రసాద్, డాక్టర్ చేతన్, డాక్టర్ సుజాత, డాక్టర్ సుకృత పాల్గొన్నారు.