పుదుచ్చేరి లెఫ్టినెట్ గవర్నర్ గా పనిచేయడం లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అన్నారు కిరణ్ బేడీ. తనకు అవకాశం ఇచ్చిన భారత ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా తన పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. తనతో కలసి పనిచేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం పని చేసినట్టు చెప్పారు. తాను చేసిందల్లా పవిత్రమైన డ్యూటీ మాత్రమేనన్నారు. రాజ్యాంగబద్ద బాధ్యతలను పూర్తి చేశానని ట్వీట్ చేశారు కిరణ్ బేడీ.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించేవరకు తమిళిసై అదనపు బాధ్యతలు చేపడుతారని పేర్కొంది. నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తొలగింపు చర్చనీయాంశమైంది.
see more news
మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి
పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు
ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు
Thank all those who were a part my journey as Lt Governor of Puducherry—
The People of Puducherry and all the Public officials. ? pic.twitter.com/ckvwJ694qq— Kiran Bedi (@thekiranbedi) February 17, 2021