
టాలీవుడ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లెటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ చిత్రం నుండి ఆకట్టుకునే పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పోస్టర్ ను వదిలారు. " మనం భారతీయులం, మనందరం ఫైటర్స్ అని గుర్తు పెట్టుకోవాలి.. అందరికీ 75వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరో 10 రోజుల్లో లైగర్ మూవీ మీ ముందుకు రాబోతుంది" అని మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలను భారీ పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో నిన్న 'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ ని కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్.