
ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపరం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి. కంపెనీల నిర్వహణ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకునే క్రమంలో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న లేఆఫ్ ప్రక్రియతో సాఫ్ట్ వేర్ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రముఖ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ తాజాగా లేఆఫ్స్ ప్రకంటించింది. వివరాల్లోకి వెళితే...
మైక్రోసాఫ్ యాజమాన్యంలోని ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం లింక్డ్ ఇన్ ఇటీవల కాలిఫోర్నియాలో 281 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందుల్లో ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులున్నారు. ఈ తొలగింపులు లింక్డ్ ఇన్ మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ లో పెద్ద ఎత్తున తొలగింపుల్లో భాగంగా కనిపిస్తున్నాయి. మే ప్రారంభంలో దాదాపు 6వేల ఉద్యోగులను తొలగించింది మైక్రోసాఫ్ట్. ఏప్రిల్ లో కంపెనీ కోడ్ లో 30 శాతం కృత్రిమ మేధస్సు (AI) రాసింది. ఇది కంపెనీ ఉద్యోగుల కోతలకు కారణం కావచ్చని మైక్రోసాఫ్ట్ సీఈవో ప్రకటించిన తర్వాత ఇది జరిగింది.
ఉద్యోగాల కోత వెనుక గల కారణాలు, తెగతెంపుల ప్యాకేజీల వివరాలు లేదా మరిన్ని తొలగింపులు జరుగుతాయని భావిస్తున్నారా అనే దానిపై లింక్డ్ఇన్ ,దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు.