- ఎస్బీఐతో కలిసి అందించిన వీ హబ్
హైదరాబాద్, వెలుగు: వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించే వీ హబ్ తాజాగా స్టేట్ బ్యాంక్తో కలిసి 66 మంది మహిళా వ్యాపారులకు లోన్లను ఇప్పించింది. రామగుండం మునిషిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ), వీ హబ్ కలిసి‘ప్రాజెక్ట్ ఇంక్లూజన్’ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆర్ఎంసీ పరిధిలోని 500 మంది మహిళా వ్యాపారులకు సాయం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు మంచి రెస్పాన్స్ వస్తోందని, 155 మందిని ఇప్పటికే సెలెక్ట్ చేశామని వీ హబ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. మొదటి విడతలో భాగంగా 66 మందికి క్రెడిట్ లింకేజ్ స్కీమ్ ద్వారా ఎస్బీఐ లోన్లను మంజూరు చేసిందని తెలిపింది. ఈ ప్రోగ్రామ్కు ఆర్ఎంసీ కమిషనర్ ఉదయ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఫణి శ్రీనివాస్, వీ హబ్ సీఈఓ దీప్తీ రావుల పాల్గొన్నారు.