
హైదరాబాద్- కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానున్నట్లు తెలిపింది సర్కార్. ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా ఉదయం 6 నుంచి10 గంటల వరకు నిత్యవసర సరుకులు తీసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాక్సిన్ కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మరికాసేపట్లో లాక్ డౌన్ కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.