వైరల్ అవుతున్న లాక్‌డౌన్ ఫేక్ జీవో

వైరల్ అవుతున్న లాక్‌డౌన్ ఫేక్ జీవో

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలంటూ సోషల్ మీడియాలో ఫేక్ జీవో వైరల్ అవుతోంది. సాయంత్రం నుంచి షాపులు తీయోద్దని.. నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందంటూ పాత జీవోను మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ జీవో నకిలీదని అధికారులు చెప్పారు. లాక్డౌన్ జీవో ఫేక్ అని.. దాన్ని ఎవరూ నమ్మోద్దని  సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వానికి లాక్డౌన్ విధించే ఉద్దేశ్యం లేదని చెప్పారు.