తెలంగాణలో షిర్డీ ఎక్స్‌ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం..

తెలంగాణలో షిర్డీ ఎక్స్‌ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం..

తెలంగాణలో షిర్డీ ఎక్స్‌ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం.. తెలంగాణలో షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది.  ట్రైన్ రన్నింగ్ లో ఉండగా లోకో పైలట్ కు ఫిట్స్ వచ్చింది.  అప్రమత్తమైన అసిస్టెంట్ లోకో పైలట్.. ట్రైన్ ను అత్యవసరంగా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే లోకో పైలట్ ను చికిత్స కోసం జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 షిర్డి నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా జనగామ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వందలాది మంది ప్రయాణికులతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ కిక్కిరిసిపోయింది. అసిస్టెంట్ లోకో పైలట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.