రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు లాటరీ

రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు లాటరీ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు శుక్రవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ (నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను ఈ లాటరీ ద్వారా కేటాయించనున్నట్టు హెచ్​ఎండీఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.  గత నెల 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ గా డీడీలు కట్టిన వారు ఇందులో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు లాటరీని యూట్యూబ్, ఫేస్ బుక్, ఏస్ మీడియాలో లైవ్ చూడొచ్చని హెచ్​ఎండీఏ తెలిపింది.