లింగంపేట, వెలుగు : బైక్ అదుపుతప్పి కిందపడడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ శివారులో శనివారం రాత్రి జరిగింది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లాల్తూర్ ముఖియా (21), రాహుల్(21), జావీద్అన్సారీ (22) రాంపూర్ గడ్డ శివారులోని భావన రైస్మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు.
శనివారం రాత్రి బైక్పై రాంపూర్ గడ్డ నుంచి గాంధారి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సివారులోని కల్వర్టు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
