రైలు కింద పడి ఈ ప్రేమికులు ఆత్మహత్య

రైలు కింద పడి ఈ ప్రేమికులు ఆత్మహత్య
  • బాసర  రైల్వేస్టేషన్​ సమీపంలో సూసైడ్​
  • మృతులు నిజామాబాద్​ వాసులు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ కు  చెందిన ఇద్దరు ప్రేమికులు బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ నాగర్సోల్​ తఎక్స్​ప్రెస్ ​రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. యువకుడు కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్ (28)గా, యువతిని సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)గా గుర్తించారు. శ్రీకాంత్ విశ్వ భారతి స్కూల్​లో టీచర్​కాగా, నందిత నిశిత డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. శ్రీకాంత్​ హైదరాబాద్​ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. నందిత ఎప్పటిలాగే కాలేజీ సమయానికి ఇంటి నుంచి వెళ్లింది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి విచారణ జరుపుతున్నారు.