తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట. కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్ పై ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రమేష్ బాబు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రమేష్ కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిర్చారు వాళ్ల పెద్దలు. అయితే పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని మనస్థాపం చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.