రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట.  కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్ పై ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రమేష్ బాబు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.  రమేష్ కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిర్చారు వాళ్ల పెద్దలు. అయితే పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని  మనస్థాపం చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు.