పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా సాయి మోహన్ ఉబ్బర తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ హృదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది.
శుక్రవారం ఈ మూవీ నుంచి ‘ఏమిటో ఏమిటో..జాలిలేని దేవుడేమో గుండెకే వేశాడు పిల్ల బాణం..’ అనే పాటను విడుదల చేశారు. శరవణ వాసుదేవన్ కంపోజ్ చేసిన ఈ పాటకు కరుణాకర్ అడిగర్ల లిరిక్స్ రాయగా, పీవీఎస్ఎన్ రోహిత్ పాడాడు. గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే మెలోడీ సాంగ్లో రక్షిత్, కోమలీ జంట ఆకట్టుకుంది.