- అవార్డును ప్రదానం చేయనున్న కర్నాటక సీఎం సిద్ధరామయ్య
హైదరాబాద్, వెలుగు : పలు పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ ‘మా జాతి సూర్యుడు’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని కర్నాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా జనవరి 13న అందుకోనున్నారు. కురుబ సమాజం తరపున ఈ అవార్డుతో పాటు రూ. 50వేల నగదును కంచె ఐలయ్యకు అందజేయనున్నారు.
ఈ అవార్డును కర్నాటక కలబురిగి ప్రాంతంలోని కనక గురు పీఠంఆంథని బ్రిడ్జి డివిజన్ సంస్థ ఇవ్వనుంది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కనక గురుపీఠాధిపతి శ్రీ నిరంజనానంద మహాస్వామి, కర్నాటక మంత్రులు సతీష్ జెర్కిహోలి, బైరతి సురేష్, ప్రియాంక్ ఖర్గే పాల్గొననున్నారు.