ఆగస్టు 19న "మాటరాని మౌనమిది"

ఆగస్టు 19న "మాటరాని మౌనమిది"

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందుతున్నదీ ఈ సినిమా. తుది హంగులు అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా తాజాగా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ ఫిల్మ్ శుక్ర అటు అప్రిసియేషన్స్ తో పాటు కమర్షియల్ గా వర్కవుట్ కావడంతో తన రెండో చిత్రానికీ అంతకంటే మంచి రిజల్ట్ వస్తుందని దర్శకుడు ఆశిస్తున్నాడు. ఈ సీజన్ లోని పెద్ద చిత్రాలు రిలీజైన తర్వాత కంఫర్ట్ టైమ్ లో "మాటరాని మౌనమిది" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

న‌టీన‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం - సినిమాటోగ్ర‌ఫీ : చరణ్, మ్యూజిక్ : అషీర్ లూక్, పిఆర్ఒ : జియ‌స్ కె మీడియా, నిర్మాత : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, ద‌ర్శ‌కుడు : సుకు పూర్వాజ్.