హైదరాబాద్ మాదాపూర్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాదాపూర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా..జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్న కియా కారులో భారీగా నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు.
సరైన ధ్రువపత్రాలు లేకుండా కారులో నగదు తరలిస్తున్నారు. 15 కాటన్ బాక్సుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ కు చెందిన రూ.2.02 కోట్ల నగదుగా గుర్తించిన పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. వాహనంలోని కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఎలక్షన్ కు ఈ డబ్బుతో సంబంధం లేదంటున్నారు పోలీసులు. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుందనేదానిపై సమాచారం తెలియాల్సి ఉంది.