అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డింది: మధుయాష్కీ గౌడ్

అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డింది: మధుయాష్కీ గౌడ్

తెలంగాణలో అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డిందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించిందని.. తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం రాక్ హిల్స్ కాలనీ, రాక్ టౌన్స్ కాలనీ, చిత్రసీమ కాలనీలో కార్యకర్తలతో కలసి ఆయన పర్యటించారు. 

Also Read : రాష్ట్రీయ ఏక్తా దివస్.. 'రన్ ఫర్ యూనిటీ'ని ప్రారంభించిన అమిత్ షా

ఈ సందర్భంగా ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కరుణాకర్ రెడ్డితో పాటు మరికొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి మధుయాష్కీ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.