కోవర్టుల సంగతి తేలుస్తం

కోవర్టుల సంగతి తేలుస్తం
  • ఓటమి భయంతోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాపై వ్యతిరేక ప్రచారం చేస్తుండు 

గాంధీభవన్ లో తనకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పం దించారు. 'ఎల్బీ నగర్ నా లోకల్. మా అమ్మ నాన్న సమాధులు అక్కడ ఉన్నాయి. ఓటమి భయంతోనే నాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నరు. కొందరు మా పార్టీ నేతలు ఎంగిలి మెతుకులు కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేసిండ్రు. 

కోవర్టుల సంగతి తేలుస్తం. ఎలక్షన్ టైంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహజం. రాష్ట్రంలో చాలామంది నేతలు ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతంలో పోటీ చేస్తున్నరు. రిసీవ్ చేసుకుంటారో లేదో ప్రజలు తెలుస్తరు. గెలిచి శ్రీకాంతాచారి నివాళి అర్పిస్తాం. బడుగులకు న్యాయం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. బీ ఆర్ఎస్, బీజేపీల కంటే ఎక్కువ టికెట్లు ఇస్తాం' అని మధుయాష్కీ చెప్పారు.