
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ జిల్లా పరిషత్ హైస్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్కు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. శుక్రవారం ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగ్గా.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు నగదు పారితోషకం ఇచ్చారు. క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి నేమ్ ప్లేట్లు ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సేవా కార్యక్రమాలు చేపడుతామని ట్రస్ట్ ఫౌండర్ లక్ష్మారెడ్డి తెలిపారు.