పుస్తకాలు పంచిన మధుర ట్రస్ట్

పుస్తకాలు పంచిన మధుర ట్రస్ట్

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్  జిల్లా పరిషత్ హైస్కూల్​లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్​కు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్​ పంపిణీ చేశారు. శుక్రవారం ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్​చార్జి రాగిడి లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగ్గా.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు నగదు పారితోషకం ఇచ్చారు. క్లాస్​ ఫస్ట్​, సెకండ్​, థర్డ్​ వచ్చిన వారికి నేమ్​ ప్లేట్లు ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సేవా కార్యక్రమాలు చేపడుతామని ట్రస్ట్​ ఫౌండర్​ లక్ష్మారెడ్డి తెలిపారు.