మధురం .. నైంటీస్‌‌‌‌ లవ్‌‌‌‌స్టోరీ

మధురం ..  నైంటీస్‌‌‌‌ లవ్‌‌‌‌స్టోరీ

ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో  యం.బంగార్రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మధురం’. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌‌‌‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయ్ రాజ్ మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అన్నాడు. 

‘1990 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌, అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తున్నాం’ అన్నాడు దర్శకుడు రాజేష్. ఇదొక యూత్‌‌‌‌ఫుల్  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని, సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బంగార్రాజు చెప్పారు.