కొత్తగా పెళ్లైన అక్కాచెల్లెళ్లు.. అత్తింటి నుంచి బంగారం, డబ్బుతో జంప్

కొత్తగా పెళ్లైన అక్కాచెల్లెళ్లు.. అత్తింటి నుంచి బంగారం, డబ్బుతో జంప్

ఇద్దరన్నదమ్ములను చేసుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు అత్తింటి వారిని బురిడీ కొట్టించారు. భర్త బయటకు వెళ్లగానే బంగారు ఆభరణాలు , లక్షన్నర నగదుతో పరారయ్యారు.  అనుకోని ఈ ఘటనతో అత్తింటివారు షాకయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని  గ్వాలియర్ లో జరిగింది.  

ఉత్తరప్రదేశ కు  చెందిన   ఇద్దరు అక్కాచెల్లెళ్లు సంజన, అంజలీలను  మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన భరత్ గుప్త, అతని కజిన్ రోహిత్ గుప్త  పెళ్లి చేసుకున్నారు.  జూన్ 9న ఎంగేజ్ మెంట్ అవ్వగా జూన్ 11న పెళ్లి చేసుకున్నారు.  అయితే  పెళ్లయిన ఐదు రోజులకు  భరత్ గుప్త  గురువారం హైకోర్టులో పనికి వెళ్లిండు. ఇదే సమయంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు సంజన, అంజలి  ఇంట్లో ఉన్న  బంగారం,  నగదుతో పరారయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో  భరత్  తల్లి  అక్క ఇంట్లోనే ఉన్నారు.

భరత్ కు తన తల్లి ఫోన్  చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో భరత్ తన భార్యకు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో భరత్ పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అక్కాచెల్లెళ్లకు సంబంధించిన ఆధార్ కార్డు తప్ప మరే ఇతర ఆధారాలు భరత్ దగ్గర  లేవు.  ఆధార్ కార్డ్ పై   ఉత్తరప్రదేశ్‌లోని పరాస్ ఖండ్, బర్గద్వా హరేణ్య మహారాజ్‌గంజ్‌ అడ్రస్ గా ఉంది.