మద్నూర్ మండలం అభివృద్ధిలో బాగా వెనుకబడింది

మద్నూర్ మండలం అభివృద్ధిలో బాగా వెనుకబడింది

బీజేపీ అధికారంలోకి వస్తే లెండి వాగు ప్రాజెక్టు పూర్తి చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో పల్లె గోస - బీజేపీ భరోసా యాత్రలో వివేక్ వెంకటస్వామితో పాటు మాజీ ఎమ్మెల్యే అరుణతారా, సోమాయప్ప స్వామీజీ పాల్గొన్నారు. గ్రామంలోని బసవేశ్వర, అంబెడ్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాలులర్పించిన వివేక్... మద్నూర్ మండలం అభివృద్ధిలో బాగా వెనుకబడిందని తెలిపారు. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్న ఆయన.. మండలంలో టీచర్ల కొరత కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల లెండి ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయిందని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తేం లెండి వాగు ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా.. మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వాటా ఇవ్వకపోవటం వల లెండి పనులు ఆలస్యం అవుతున్నాయని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అంతే కాకుడా పెద్ద ఎక్లారా గ్రామాన్ని మండలంగా చేస్తామని హామీ ఇచ్చారు. మద్నూర్ లో అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తామన్న ఆయన.... వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. కచ్చితంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.