
- జూబ్లీహిల్స్పై పట్టు నిలుపుకున్న గోపీనాథ్
- మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2014లో టీడీపీ నుంచి, 2018, 2023లో బీఆర్ఎస్ తరఫున విజయం
హైదరాబాద్సిటీ, వెలుగు: రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్నగరంపై తనదైన ముద్ర వేశారు. 1982లో మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీలో చేరి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కు అత్యంత విధేయుడిగా పేరు పొందారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ సన్నిహితంగా ఉన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్ లో కొనసాగుతూ మాజీ సీఎం కేసీఆర్కు సన్నిహితుడిగా మెలిగారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను ఉన్న పార్టీకి విధేయుడిగా ఉండాలని కోరుకునే గోపీనాథ్కడవరకూ అదే విధానాన్ని పాటిస్తూ వచ్చారు.
పుట్టి, పెరిగింది ఇక్కడే..
గోపీనాథ్తల్లిదండ్రులు ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్లోస్థిరపడ్డారు. ఆయన 1963 జూన్ 2న హైదర్గూడలో జన్మించారు. సిటీలోనే చదువు కొనసాగించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్(బీఏ) పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్స్థాపించిన టీడీపీ స్టేట్ ఆఫీస్ హిమాయత్నగర్లో ఉండడంతో గోపీనాథ్ తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అందువల్లే ఎన్టీఆర్ తో ఆయనకు సాన్నిహత్యం పెరిగిందని అంటుంటారు.
ఎన్టీఆర్వీరాభిమాని అయిన మాగంటి పలుమార్లు అప్పటి హిమాయత్ నగర్నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్దక్కలేదు. కానీ, పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
హాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్అభ్యర్థి విష్టువర్ధన్రెడ్డిపై విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం టీడీపీలో కొనసాగిన ఆయన మాజీ సీఎం కేసీఆర్పిలుపుతో బీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి రెండోసారి విజయం సాధించారు.
అసెంబ్లీ పబ్లిక్ఎస్టిమేషన్కమిటీ(పీఈసీ) సభ్యుడిగా పని చేశారు. 2023లో కాంగ్రెస్అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి, హ్యాట్రిక్విజయాన్ని అందుకున్నారు. మాగంటి సేవలను గుర్తించిన కేసీఆర్ఆయనకు గ్రేటర్హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీని ముందుకు నడిపించలేక పోయారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్న గోపీనాథ్మృతితో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనముక్కుసూటితనం వల్ల రాజకీయంగా చాలామంది శత్రువులు తయారయ్యారని, వారితో తరచూ జరుగుతున్న గొడవలతోనే మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతుంటారు.
సినీ నిర్మాతగా గోపీనాథ్
మాగంటి గోపీనాథ్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. సినీ ఇండస్ట్రీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గోపీనాథ్వాడిన బుల్లి కారు ఒకటి చాలా సినిమాలకు అట్రాక్షన్గా వాడుకునేవారు. ఆయన 1985లో పాతబస్తీ, 2000లో రవన్న, 2003లో తారకరత్న హీరోగా భద్రాద్రి రాముడు, 2009లో డాక్టర్రాజశేఖర్హీరోగా నా స్టైలే వేరు సినిమాలు నిర్మించారు. అనంతరం రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో సినిమాలను తగ్గించారు.