
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బై పోల్స్ ఐరిలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్తో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'రాష్ట్ర మంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హై దరాబాదులో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలి. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొన సాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చారు. అందరూ ఆశీర్వదిం చండి.' అంటూ అని కేటీఆర్రెక్వెళ్చేశారు.
జాయింట్ వెంచర్ సర్కార్: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని కేటీఆర్విమర్శించారు. చరి త్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఫైర్అయ్యారు. 'ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే. బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూల గొడుతుందో అని భయంతో బతుకుతున్నరు. కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే మీ వేలుతో , మీకంటినే పొడుచుకున్నట్టే. కేసులకు భయ పడితే లీడర్లు కాలేరు. న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి.
మోదీ దగ్గర స్కూల్ కు. చంద్రబాబు దగ్గర కాలేజీకి వెళ్లి, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర హైస్కూల్ చదువుతుంటే ఫెయిల్ అయిండని పార్టీ నుంచి వెళ్లగొట్టారు' అంటూ కేటీఆర్ చురు కలంటించారు.