హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద సోమవారం ఉదయం10 గంటలకు సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చింది. అందరూ ధర్నాకు హాజరై కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు.
