మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ: మంత్రులుగా 18మంది ప్రమాణం

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ: మంత్రులుగా 18మంది ప్రమాణం

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. బీజేపీకి నుంచి 9, శివసేన నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రమాణం చేయించారు.  బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ పాటిల్, రవీందర్ చౌహన్, మంగళ్ ప్రభాత్, విజయ్ కుమార్, అతుల్ సవే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక శివసేన నుంచి దాదా బహుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, అబ్దుల్ సత్తర్, ఉదయ్ సమంత్, గులాబ్ రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, సందీపన్, తానాజీ సవంత్ మంత్రలుగా ప్రమాణం చేశారు. 

 కాగా జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎంగా..ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అప్పటినుంచి ఇద్దరితోనే కేబినెట్ కొనసాగుతోంది. అయితే నెల రోజులకుపైగా ఇద్దరితోనే కేబినెట్ కొనసాగడంపై పలు విమర్శలు రావడంతో మంత్రి వర్గాన్ని విస్తరించారు సీఎం షిండే.