
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్వాటర్తో తలెత్తే ముంపుపై ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర డిమాండ్చేసింది. ఈమేరకు ఆ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు గురువారం లేఖ రాశారు. 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్స్టేట్బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేడిగడ్డ బ్యాక్వాటర్ ఎఫెక్ట్తో పాటు ఫ్లడ్, డిజైన్ను స్టడీ చేయాలని కోరారు. తాము ఈ విషయమై ఏడేండ్లుగా కోరుతున్నా.. కనీసం స్టడీ కూడా చేయలేదన్నారు.
2022 జులైలో గోదావరికి పోటెత్తిన వరదలతో సిరొంచతో పాటు పలు ప్రాంతాల్లో మేడిగడ్డ బ్యారేజీ కారణంగా పెద్ద ఎత్తున ముంపు వాటిల్లిందని తెలిపారు. మళ్లీ వర్షాకాలం సీజన్వచ్చినా వరద ముంపు నివారణ చర్యలేవి చేపట్టలేదన్నారు. మేడిగడ్డ ముంపు ప్రాంతాలుగా గుర్తించిన భూములకు పరిహారంగా రూ.25.64 కోట్లను గడ్చిరోలి కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యాక్వాటర్తో తలెత్తే ముంపుపై వెంటనే రెండు రాష్ట్రాల ఇరిగేషన్ప్రిన్సిపల్సెక్రటరీలు,స్పెషల్సీఎస్ల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 2022 జులైలో తలెత్తిన వరదలను ప్రామాణికంగా తీసుకొని ముంపు ప్రభావం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.