పాముతో  ఆటలాడి ప్రాణం తీసుకుండు

పాముతో  ఆటలాడి ప్రాణం తీసుకుండు

థానే: మహారాష్ట్రలో ఓ యువకుడు పాముతో చెలగాటమాడి, అది కాటేయడంతో చనిపోయాడు.  థానే జిల్లా ముంబ్రా టౌన్ షిప్​లో ఉండే మొహమ్మద్ షేక్ బుధవారం మార్కెట్ ఏరియాలో ఓ పామును పట్టుకున్నాడు. ఆపై దాన్ని మెడలో వేసుకొని రకరకాల ఫీట్లు చేశాడు. అప్పటికే రెండు మూడు సార్లు పాము కరిచినా లెక్క చేయలే. ఇటు మొహమ్మద్ ఫ్రెండ్స్ కూడా అతన్ని ఆపలేదు. మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి విషం రక్తనాళాల్లోకి చేరడంతో మొహమ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చుట్టుపక్కల వారు అతన్ని దగ్గర్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి మొహమ్మద్ చనిపోయినట్లు చెప్పారు. పోలీసులు యాక్సిడెంటల్ డెత్​గా కేసు నమోదు చేసి, పోస్టుమార్టంకోసం మృతదేహాన్ని థానే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.