మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ  కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్క రోజులోనే 4 024 మంది కొవిడ్ బారిన పడ్డారు. వారిలో నాలుగురికి బీఏ 5  వేరియెంట్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంట్లలో 3028 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 19,261 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై, థానే, నవీ ముంబై, పూణేల్లో బీఏ 5 వేరియెంట్ కేసులు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారంతా 19 నుంచి 36ఏళ్ల మహిళలని చెప్పింది. ప్రస్తుతం ఆ నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.

మరోవైపు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబయిలోనూ రోజువారీ కొత్త కేసుల సంఖ్య  2 వేల మార్కు దాటింది. గత 24 గంటల్లో ముంబయిలో 2,293మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. జనవరి 23 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కరోనా కారణంగా ఇవాళ ఒకరు చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ముంబయిలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 10,85,882కు చేరింది.