మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌‌కు రివార్డు

మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌‌కు రివార్డు

మహబూబాబాద్ : సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్కు ఎస్పీ శరత్​ చంద్ర పవార్​ సత్కరించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున కురవి వీరభద్రస్వామి కళ్యాణ మండపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బానోత్ నిర్మల అనే మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను అక్కడే విధుల్లో ఉన్న గుడూరు కానిస్టేబుల్ రాధిక సీపీఆర్ (గుండె కొట్టుకునేలా చేసే ప్రక్రియ) చేసి, నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాలు నిలిపింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఈ రోజు రాధికను తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. క్యాష్ రివార్డ్ ఇచ్చి అభినందించారు.  కార్యక్రమంలో అడీషనల్ ఎస్పీ, జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ ఇన్​చార్జి డీఎస్పీ రమణబాబు, మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్, కురవి ఎస్ఐ రాము పాల్గొన్నారు.