
650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ నమ్రత దంపతులు
హైదరాబాద్ : సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ఇవాళ తమ 14 వ పెళ్లిరోజును జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ముందుడే మహేష్ – నమ్రత దంపతులు …. పెళ్లిరోజు సందర్భంగా తమ ఆనందాన్ని అంధులైన పిల్లలతో పంచుకున్నారు. 650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేట లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాట్లు చేశారు. మహేష్ – నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు.. వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని కోరుకున్నారు.