
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' జనవరి 12న గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైంది. ఇవాళ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక గ్రాండ్ గా మొదలైంది.
ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.“గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. నాకు స్నేహితుడి కంటే ఎక్కువ. నా కుటుంబసభ్యుడిలాగా. గత రెండు సంవత్సరాలుగా నాకు త్రివిక్రమ్ చాలా సపోర్ట్ చేశారు. ఆయన సినిమాల్లో నేనెప్పుడు చేసినా.. నా నటనలో మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. ఖలేజా సినిమా సమయంలో నా నటనలో ఓ మ్యాజిక్ జరిగింది..ఇప్పుడు అదే మ్యాజిక్ గుంటూరు కారంలో జరగింది. ఈ సినిమాలో కొత్త మహేష్ ను చూడబోతున్నారు..లవ్ యూ త్రివిక్రమ్ అంటూ చెప్పుకొచ్చారు.
హీరోయిన్ శ్రీలీలతో డాన్స్ చేయడం అంటే..ప్రస్తుత టాలీవుడ్ హీరోలందరికి తాట ఊడిపోద్ది. తెలుగమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ కావడం గర్వంగా ఉందని అన్నారు మహేష్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాకు బ్రదర్ లాగా. ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టే సాంగ్ గురించి అడగ్గానే.. ఏమి ఆలోచించకుండా ఆ సాంగ్ ఇచ్చేశాడు..థియేటర్లలో ఆ పాట వచ్చేటప్పుడు..ఫ్యాన్స్ ఎవ్వరు సీట్ లో కూర్చోరని..డ్యాన్స్ తో థియేటర్స్ బద్దలైపోద్ది అన్నారు.
ఏవీ చూడగానే నాకు పాతిక సంవత్సరాలు అని తెలిసింది. ఇదివరకు నాకు తెలియదు. అదంతా మీరు చూపించిన అభిమానమే. మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప మరేమి తెలియదు.ఎప్పుడు చెబుతూ ఉంటానుగా..ఇకపై మీరే నాకు అమ్మా, నాన్న” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.