- కేటీఆర్కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచన
- బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చినా, బీజేపీ ఆర్ఎస్గా మార్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా
నిజామాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలను ప్రజలకు చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పీసీసీ చీఫ్మహేశ్గౌడ్ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో తప్పిదాలు జరిగినట్టు ఒప్పుకోవడం సంతోషమే.. అయినా ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ, ప్రాజెక్టుల పేరుతో చేసిన నిధుల దోపిడీ, నిరుద్యోగులను గోస పెట్టిన అంశాలను వివరించి యాత్ర షురూ చేయాలన్నారు. సోమవారం నిజామాబాద్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చినా, బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా బీజేపీ ఆర్ఎస్గా మార్చినా ప్రజలు నమ్మరని ఎద్దే వా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతున్న పేదలు తమ సర్కార్ను నెత్తిన పెట్టుకుంటున్నారని తెలిపారు.
కవిత నిజాలు చెప్తున్నరు..
మాజీ సీఎం కేసీఆర్కూతురు కవిత కుటుంబ ఆస్తుల పంచాదీతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని మహేశ్గౌడ్అన్నారు. బీఆర్ఎస్టైంలో అన్న కేటీఆర్, బావ హరీశ్రావు, కజిన్ సంతోష్ రావు రాష్ట్రాన్ని ఎట్ల దోచుకున్నరో ఆమె నిజాలు చెప్తున్నారని తెలిపారు. అయితే, పదేండ్ల కేసీఆర్పాలనలో కవిత కూడా భాగస్వామేనని పేర్కొన్నారు. ఆమె పెట్టబోతున్న పార్టీకి కాంగ్రెస్ ఫండింగ్ చేస్తుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పసలేని ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమకు లేదన్నారు.
అర్వింద్ మరోసారి గెలవరని, ఎప్పు డూ కులం, మతం, శ్రీరాముడి పేరుతో ఓట్లడిగితే ప్రజలు వేయరని చెప్పారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి రాజీవ్గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ స్కీమ్లకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మొద్దన్నారు. ఎవరైనా పైరవీలు చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, డీసీసీ ప్రెసి డెంట్ నగేశ్రెడ్డి, కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

