శ్రీనగర్ శివార్లలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో పెద్ద విజయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మేలో రియాజ్ హత్య తర్వాత ఈ బృందానికి నాయకత్వం వహించిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముహాజిదీన్ చీఫ్ సైఫుల్లా జమ్మూ– కాశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరని,భద్రతా దళాలపై పలు దాడులకు పాల్పడినట్లు జమ్మూకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
దక్షిణ కాశ్మీర్ నుంచి సైఫుల్లా శ్రీనగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో కూబింగ్ నిర్వహించినట్లు ఐజీపీ తెలిపారు. ఈ ఆపరేషన్ లో సైఫుల్లాను ఎన్ కౌంటర్ చేయగా..మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. జమ్మూ– కాశ్మీర్ పోలీసుల నెట్వర్క్ బలంగా మారిందని,నగరంలోకి ప్రవేశించే ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం లభిస్తుందని కుమార్ చెప్పారు.