శ్రీరంగనీతులు మూవీ టీజర్ రిలీజ్

శ్రీరంగనీతులు మూవీ టీజర్ రిలీజ్

ఎదుట వాడికి చెప్పేటందుకే  నీతులు ఉన్నాయంటున్నారు  తనికెళ్ల భరణి.  సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘శ్రీరంగనీతులు’ చిత్రం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డైలాగ్ ఇది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ జనరేషన్‌‌‌‌‌‌‌‌ను ఆకట్టుకునేలా సాగింది ఈ టీజర్. ఇందులో తనికెళ్ల భరణి ఇంపార్టెంట్ రోల్ చేశారు. 

‘సొసైటీలో మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అనేది తెలియాలంటే ఈతరాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది’ అని ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఈత‌‌‌‌‌‌‌‌రం యువ‌‌‌‌‌‌‌‌త ఆలోచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు, వారి ఎమోష‌‌‌‌‌‌‌‌న్స్‌‌‌‌‌‌‌‌ ఏ విధంగా ఉంటున్నాయనేది ఇందులో చూపిస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని,  ప్రస్తుతం పోస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టామన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని  చెప్పారు.  హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.