ఎదుట వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటున్నారు తనికెళ్ల భరణి. సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘శ్రీరంగనీతులు’ చిత్రం టీజర్లోని డైలాగ్ ఇది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ జనరేషన్ను ఆకట్టుకునేలా సాగింది ఈ టీజర్. ఇందులో తనికెళ్ల భరణి ఇంపార్టెంట్ రోల్ చేశారు.
‘సొసైటీలో మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అనేది తెలియాలంటే ఈతరాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది’ అని ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఈతరం యువత ఆలోచనలు, వారి ఎమోషన్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది ఇందులో చూపిస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్తో పాటు ప్రమోషన్స్ను మొదలుపెట్టామన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.