పార్లమెంట్ లో వంశీ గర్జిస్తడు: మక్కన్ సింగ్ ఠాకూర్

పార్లమెంట్ లో వంశీ గర్జిస్తడు: మక్కన్ సింగ్ ఠాకూర్
  • బీజేపీని బొంద పెడదాం
  • బీఆర్ఎస్​ తో రాష్ట్రం అప్పులపాలు
  • రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ రాజ్ ఠాకూర్​

 
బెల్లంపల్లి:  పెద్లపల్లి ఎంపీగా కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపిస్తే ప్రజల గొంతుకగా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ లో పులిలా గర్జిస్తాడని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ రాజ్ ఠాకూర్​ అన్నారు.  ఇవాళ ఇవాళపెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్ ఠాకూర్​  మాట్లాడుతూ బీజేపీని బొంద పెట్టే సమయం వచ్చిందన్నారు. బీజేపీ మత రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.  సింగరేణి బావులను ప్రైవేట్​ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.

 కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. గత సర్కార్​ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు.  ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.  పెద్దపల్లిలో కాంగ్రెస్​ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్​ను ప్రధానిని చేయడానికి వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఎమ్మెల్యేగా కాకముందు ఇప్పుడు నీ ఆస్తి వందల కోట్లకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​కు ఆయన సవాల్ విసిరారు.