- బీజేపీని బొంద పెడదాం
- బీఆర్ఎస్ తో రాష్ట్రం అప్పులపాలు
- రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
బెల్లంపల్లి: పెద్లపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపిస్తే ప్రజల గొంతుకగా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ లో పులిలా గర్జిస్తాడని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఇవాళ ఇవాళపెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీని బొంద పెట్టే సమయం వచ్చిందన్నారు. బీజేపీ మత రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి బావులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. గత సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ను ప్రధానిని చేయడానికి వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఎమ్మెల్యేగా కాకముందు ఇప్పుడు నీ ఆస్తి వందల కోట్లకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆయన సవాల్ విసిరారు.