మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన .. ఆదిలాబాద్ జిల్లా మాల సంఘం నేతలు

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన .. ఆదిలాబాద్ జిల్లా మాల సంఘం నేతలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, భూగర్భశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆదివారం ఆదిలాబాద్ ​జిల్లా మాల సంక్షేమ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్​ఆధ్వర్యంలో నేతలు మంత్రికి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు.

 జిల్లాలో పర్యటించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కన్వీనర్ సర్వయ్య, రాష్ట్ర నేత రవికుమార్, జిల్లా నాయకులు ముల్కల రాజేశ్వర్, పాశం రాఘవేంద్ర, అక్కపల్లి లక్ష్మణ్, మేదరి స్వామి ఉన్నారు.