- కాంగ్రెస్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
జవహర్ నగర్, వెలుగు: మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు, టీఆర్ఎస్ లీడర్లు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పీసీసీ స్పోక్స్ పర్సన్ సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన జవహర్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. జవహర్నగర్పరిధిలోని సర్వే నంబర్488లో మంత్రి మల్లారెడ్డి చుట్టాలమంటూ కొందరు అక్రమ నిర్మాణం చేపట్టి హాస్పిటల్ఏర్పాటు చేశారని ఆరోపించారు. మంత్రి అండదండలు లేకుండా ఇదంతా సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పీర్జాదిగూడలో గవర్నమెంట్ల్యాండ్ను ఆక్రమించి టీఆర్ఎస్ లీడర్లు ఫంక్షన్హాల్కట్టారని చెప్పారు. దేవరయాంజాల్లోని సర్వే నంబర్437లో మంత్రి మల్లారెడ్డి కుటుంబమే దేవాదాయశాఖ భూమిని ఆక్రమించిందని ఆరోపించారు. జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్కార్పొరేషన్ఆఫీసుకు కూతవేటు దూరంలో భారీ నిర్మాణం చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. మంత్రి కేటీఆర్స్పందించి అక్రమ కట్టడాలను, కబ్జాలను అడ్డుకోవాలని హరివర్థన్రెడ్డి కోరారు. మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు, బంధువర్గంపై, సహకరిస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జవహర్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ప్రెసిడెంట్ మల్లెపూల శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, లీడర్లు వేణు, కిరణ్, క్రాంతి కుమార్, నరసింహ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం: