నేను ఫ్రీ బర్డ్.. స్వేచ్ఛగా బతుకుతా

నేను ఫ్రీ బర్డ్.. స్వేచ్ఛగా బతుకుతా

తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు అసద్ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో తన భద్రతకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ..కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా తనకు జెడ్ కెటగీరి భద్రత అందిస్తామని అందుకు అంగీకరించాలని కోరారు. అయితే అసద్ మాత్రం అలాంటి సెక్యూరిటీ తనకు వద్దని ట్వీట్ చేశారు. సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)నిరసనల్లో మృతి చెందిన 22 మంది కంటే తన ప్రాణం విలువ కాదని ఆయన అన్నారు.తన చుట్టూ ఆయుధాలు ఉన్నవారిని తాను ఇష్టపడనన్నారు. తాను స్వేచ్ఛా పక్షిని... స్వేచ్ఛగానే జీవించాలనుకుంటున్నానని ఎంపీ అసద్ తెలిపారు. 

అసద్ యూపీ పర్యటనలో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆగంతకులు ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈనెల 3న ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన అసదుద్దీన్ ఓవైసీపై దుండగులు కాల్పలు జరిపారు. యుపిలోని హాపూర్ జిల్లాలోని పిఎస్ పిల్ఖువా పరిధిలో టోల్ గేట్ వద్ద అసద్ కాన్వాయ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి  అసద్ క్షేమంగా బయటపడ్డారు.