అన్ని పార్టీల వాళ్లు నన్ను పిలుస్తుండ్రు : మల్లారెడ్డి

అన్ని పార్టీల వాళ్లు నన్ను పిలుస్తుండ్రు : మల్లారెడ్డి

హైదరాబాద్: తనను అన్ని పార్టీల వాళ్లు పిలుస్తున్నారని, తాను పోనని, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని పార్టీ మారడం అనేది ఆయన ఇష్టమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ  భవన్ వద్ద ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్నికల ముందు లెక్క కోసమే కాంగ్రెస్ లోకి వెంకటేశ్ వెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదని చెప్పారు. అక్కడ వివేక్ కుమారుడికే ఇస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలన్నారు. లేకుంటే ప్రజలు తిరగబడ్తరని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తనను తిట్టారని, అందుకే తానూ తిట్టానని మల్లారెడ్డి బదులిచ్చారు.