- ఖమ్మం సభనుద్దేశించి మల్లికార్జున ఖర్గే ట్వీట్
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని 3.8 కోట్ల మంది ప్రజలు మార్పు కోరుకుం టున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావాని కి కాంగ్రెస్ పార్టీ బ్లూప్రింట్ సిద్ధం చేసిం దని వెల్లడించారు. సామా జిక న్యాయం, సమానత్వం ఆధారం గా తెలంగాణ అభివృద్ధి, పురోగతికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఖమ్మం ‘తెలంగాణ జనగర్జన’ సభను పురస్కరించుకొని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఖమ్మంలో 1,360 కి.మీ పాదయాత్రను పూర్తి చేసుకున్న సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకు ఖర్గే కంగ్రాట్స్ చెప్పారు. పలువురు సీని యర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయను న్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ సమిష్టి నాయకత్వంపై కాంగ్రెస్ గర్విస్తున్నదని ట్వీట్లో రాసుకొచ్చారు.