హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ పర్యటించే జిల్లాల్లో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయ డాన్ని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఖండించారు. గద్వాల జిల్లాకు సీఎం వెళ్తున్నందున ఏఐసీసీ సెక్రటరీ సంపత్ను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్యగా పేర్కొంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఎం జిల్లాకు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని జనాలు ఆశిస్తారని, వారి సమస్యలపై ప్రతిపక్ష నాయకులు వినతిపత్రాలు ఇస్తారని రవి తెలిపారు. కేసీఆర్ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. తెలంగాణ పూర్తిగా పోలీసుల రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.