టీఎంసీ కార్యకర్తలపై దాడి వెనుక అమిత్ షా

టీఎంసీ కార్యకర్తలపై దాడి వెనుక అమిత్ షా

త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ అధికారం సాధిస్తుందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ మాన్ స్టర్ లా వ్యవహరిస్తోందన్నారు. నిన్న త్రిపురలో అభిషేక్ బెనర్జీ సహా తృణమూల్ నేతలపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించారు మమత. పోలీసుల కళ్లముందటే బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడినా... వారు ఏమీ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అమిత్ షా మద్దతుతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీ ప్రయాణించిన ఫ్లైట్ లోనే గూండాలు కూడా త్రిపుర వెళ్లారన్నారు మమత.