కరోనా కేసులు పెరగడంపై మమత అలర్ట్

కరోనా కేసులు పెరగడంపై మమత అలర్ట్

మాస్కు దవడకు కాదు ముక్కుకు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కరోనా కేసులు పెరగడంపై జనాన్ని అలర్ట్ చేశారు దీదీ. దసరా పండుగ నుంచి బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పండుగకు ముందు రెండు వందల్లోపే ఉన్న కేసులు... ఇప్పుడు వెయ్యి దగ్గరకు చేరాయి. దీంతో జనాన్ని హెచ్చరించారు సీఎం మమత. చాలామంది కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. మాస్కు సరిగా పెట్టుకుని కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

సిద్ధూ వల్ల కాంగ్రెస్ పార్టీ కామెడీ షోలా మారింది

పేదల సంక్షేమమే మా లక్ష్యం