గోవాలో పర్యటించనున్న మమతాబెనర్జి

గోవాలో  పర్యటించనున్న మమతాబెనర్జి

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి వచ్చేవారం గోవాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె అక్టోబర్ 28న గోవాకు వెళ్లనున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)కి చెందిన కీలక నేత శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభంలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా గోవాలో మమతా బెనర్జి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో TMC పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు చిన్న రాష్ట్రాలైన త్రిపుర, గోవాల్లో అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తోంది.