మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్ పై దాడి

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్ పై దాడి

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్ పై దాడి జరిగింది. అభిషేక్‌ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. 

బీజేపీపాలనలో ప్రజాస్వామ్యం ఎలా వుందో చూడండి అంటూ అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. సీఎం విప్లవ్‌ దేవ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కొత్త శిఖరాల వైపు తీసుకెళ్తున్నారంటూ ఆరోపించారు.

వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడంతో పాటు ఈ విషయాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.